News

హైకోర్టులోచంద్రబాబుకు ఊరట


 ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఓటుకు నోటు కేసులో హైకోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  దీనిపై ఏసీబీ కోర్టు చంద్రబాబును విచారించాలని తీర్పునివ్వడంతో... సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో శుక్రవారం ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇస్తూ తీర్పునిచ్చింది. చంద్రబాబు తరుపున సీనియర్‌ కౌన్సిల్‌ సిద్ధార్థ లూథా వాదనలు వినిపించారు.